మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పిఈటి సుజాతను ఆ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత ఉపాధ్యాయులు గురువారం ఘనంగా సన్మానించారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత మాట్లాడుతూ సుజాత గత 14 సంవత్సరాలుగా పాఠశాలలో విశిష్టమైన నిబంధనతో సేవలందిస్తూ విద్యార్థినిల వ్యక్తిగత క్రీడలు మార్షల్ ఆర్ట్స్ ను ప్రోత్సహిస్తూ విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విద్యార్థులను క్రీడారంగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని స్పెషల్ ఆఫీసర్ సునీత అభినందించారు. పాఠశాలకు చెందిన అజ్మీర మానస సుజాత శిక్షణలో రెజ్లింగ్ పోటీలో తెలంగాణ రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చిందని అన్నారు. ఉత్తమ శిక్షణ ఇచ్చినందుకు గాను సమగ్ర శిక్ష తెలంగాణ ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాసంచాలకులు,డాక్టర్ నవీన్ నికోలాస్ ఐఏఎస్ హైదరాబాదులో సుజాతను సత్కరించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

