మన ప్రగతి న్యూస్/ తెలకపల్లి ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో గంజాయికి బానిసలైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు డి.ఎస్.పి శ్రీనివాస్ యాదవ్, సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ బి నరేష్, శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు స్థానికంగా, విజయ్ కి చెందిన వెంచర్లో నలుగురు యువకులు ఓ మైనర్ బాలుడు గంజాయి సేవిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం వెళ్లి గంజాయి సేవిస్తున్న యువకులు గణేష్, నారాయణ, చరణ్, అంజిత్, మరో మైనర్ బాలుడిని అరెస్టు చేశారు, నిందితులు నాగర్ కర్నూల్ కు చెందిన రేణు కుమార్, విశ్వాస్ , వంశీ, సందీప్, ద్వారా గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు, నిందితులను కోర్టు ద్వారా రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు, అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని సూచించారు.

