మన ప్రగతి న్యూస్/నడికూడ:
హనుమకొండ జిల్లా నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన మండల అభివృద్ధి అధికారి ( ఎంపీఓ ) గా పి. భార్గవి రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతన ఎంపీఓ మార్గవి రెడ్డి ని మండల ప్రత్యేక అధికారి బక్కి నవీన్ కుమార్, ఎంపీడీవో రామ రామకృష్ణ లు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్ సరోజన, కంప్యూటర్ ఆపరే టర్స్ ఆసిఫ్ ఖాన్, సాగర్, కార్యాలయ సిబ్బంది ప్రవీణ్, సాయికృష్ణ, అభిరామ్ లు కూడా నూతన మండల పంచాయతీ అధికారినికి శుభాకాంక్షలు తెలియ జేశారు.


