మన ప్రగతి న్యూస్/ తెలకపల్లి ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ వెంచర్ లో మండల కేంద్రానికి కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్న క్రమంలో నమోదైన సమాచారంతో ఎస్సై బి నరేష్ తన సిబ్బందితో మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఐదు మంది యువకులు గంజాయితో పట్టుపడ్డారు నాగర్కర్నూల్ సంబంధించిన నలుగురు యువకులు, హైదరాబాద్ దూల్పేట్ లోని ఆకాశ సింగ్ అనే వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసి వివిధ గ్రామాలకు అధిక రేట్లకు సరఫరా చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు పోలీస్ ల రైడ్ లో ఐదు మంది గంజాయి ముఠా ను అరెస్టు చేసి వారి వద్ద నుండి 130 గ్రాముల గంజాయిని ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు డిఎస్పి బుర్రి శ్రీనివాసులు మీడియా ద్వారా వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి తెలకపల్లి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

