మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దయాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన వేగం పెరిగింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటోంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం దీర్ఘాయుష్షు, రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ఆకాంక్షించారు.

