
జర్నలిస్టు జానిపాషా, క్రికెట్ నిర్వాహకులు మహమ్మద్ మతీన్
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
ఆర్జెసి విద్యాసంస్థల అధినేత గుండాల ఆర్ జె సి కృష్ణ జన్మదినం సందర్భంగా జర్నలిస్టు జానిపాషా, క్రికెట్ నిర్వాహకుడు మహమ్మద్ మతీన్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కృష్ణ ని శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యా రంగంలో ఆర్జెసి కృష్ణ సేవలు అభినందనీయమని, పేద మరియు గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని జానిపాషా, మతీన్ పేర్కొన్నారు. సమాజ సేవా కార్యక్రమాలలోనూ కృష్ణ చురుకుగా పాల్గొంటూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని వారు అన్నారు.ఆర్జెసి కృష్ణ ఆరోగ్యసమృద్ధిగా ఉండి, విద్యా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
