విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పైళ్లకి ఆహ్వానం
మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
బీబీనగర్ మండల పరిధిలోని మహాదేవపూర్ గ్రామంలో ఈ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పార్వతి అమ్మవారు,గణపతి స్వామి,సుబ్రహ్మణ్యస్వామి,వీరభద్ర స్వామి,నంది,సింహం,బలిపీఠం ప్రతిష్ట మహోత్సవానికి హబ్సిగూడలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల ప్రభాకర్,మాజీ సర్పంచ్ దేవరకొండ వేణుగోపాల్,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దండెం వెంకటేష్,మాజీ వార్డ్ సభ్యులు వెంగల భాస్కర్ రెడ్డి,మునిగాల మధు,బిఆర్ఎస్వి బీబీనగర్ మండల అధ్యక్షులు పచ్చిమట్ల వంశీ గౌడ్,యూత్ నాయకులు ఆకుల ప్రవీణ్ కుమార్,వెంగల భాను ప్రకేష్ రెడ్డి,మునిగాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

