మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
మక్తల్ ప్రాంతానికి చెందిన చెందిన సత్తమ్మ W% వెంకటేష్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం పశుసంవర్ధక,పాడిపరిశ్రమాభివృద్ధి,మత్స్య,క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని సంప్రదించగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3లక్షల రూపాయల LOC ను మంజూరు చేయించారు.సంబంధిత LOC ని ఆదివారం మంత్రి అధికారిక నివాసంలో వారికి అందచేశారు.మంచి వైద్యం అంది,బాధితుడు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.మీకు మరియు మీ కుటుంబానికి ప్రభుత్వము ద్వారా లబ్ధి చేకూర్చినందుకు సంతోషిస్తున్నాను.రాష్ట్రములోని నిరుపేద ప్రజలకి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది.సత్తమ్మ మరియు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఆనందముగా ఉండాలని కోరుకుంటున్నాను అని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

