మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- ఆత్మకూరు పట్టణంలో ఆదివారం జాతీయ న్యాయ సేవల దినోత్సవ సందర్భంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు న్యాయస్థానం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని అందించడం కొరకు చట్టం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపబడుతుంది.జాతీయ న్యాయ సేవల దినోత్సవం.న్యాయ సేవలు పొందడం ప్రజల హక్కు.కుల మత రాజకీయాలకు అతీతంగా న్యాయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీకే రాములు, డి అశోక్ కుమార్ సీనియర్ న్యాయవాది తిప్పారెడ్డి ,నారాయణ గౌడ్, న్యాయవాదులు శంకర్ లింగం, ముక్తేశ్వర్,పిన్నంచర్ల అశోక్ గౌడ్ ,రామచందర్ జి, అబ్రహం, కోర్టు సూపర్డెంట్ తిప్పన్న, లోక్ అదాలత్ సిబ్బంది స్వప్న, విద్యావతి, రాజ్యలక్ష్మి,కోర్ట్ కానిస్టేబుల్స్ జాకీర్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు

