Breaking News

తడకమళ్ళలో అక్రమ ఇసుక రవాణా – రెండు ట్రాక్టర్లు పట్టుబాటు

మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ:

గ్రామ శివారులోని మూసి వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఘటనపై పోలీసులు దాడి చేసి రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.పోలీసులకు అందిన సమాచారంతో పెట్రోలింగ్ సిబ్బంది తడకమళ్ళ గ్రామ శివారుకు చేరుకున్నారు. అక్కడ రెండు ట్రాక్టర్లు ట్రాలీల్లో ఇసుక నింపుకొని కోడెబండ తండా వైపు వెళ్తుండగా గుర్తించారు. వెంటనే వాటిని ఆపి పరిశీలించగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు తేలింది.మొదటి ట్రాక్టర్ డ్రైవర్ మరియు యజమాని సిలువేరు ఆదినారాయణ (తండ్రి జానయ్య), నివాసం తడకమళ్ళగా గుర్తించారు. ట్రాక్టర్ నెంబర్లు టీఎస్ 05 యూసి 5148, టీఎస్ 05 యూసి 5147గా ఉన్నాయి. రెండవ ట్రాక్టర్ డ్రైవర్ అల్వాల నాగరాజు (తండ్రి మురారి), యజమాని చిన్నగాని వెంకటేశ్వర్లు (తండ్రి ఎల్లయ్య), ఇద్దరూ తడకమళ్ళ గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. ఈ ట్రాక్టర్ నెంబరు టీజీ 05 ఈ 2550 కాగా ట్రాలీ నెంబర్ లేకుండా ఉంది.
పోలీసులు రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు మరియు యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

విద్యుత్ షాక్ తో మహిళ మృతి..