Breaking News

10 వార్డు వివేకానంద కాలనీ లో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన మున్సిపాలిటీ చైర్ పర్సన్

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ఆటో డ్రైవర్‌ అదృశ్యం

నర్సంపేట పట్టణంలోని 10వార్డు వివేకానంద కాలనీలో కాలువ కట్టమీద కొత్త ట్రాన్స్ ఫార్మర్ ను మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ , వైస్ చైర్మన్ గంధం నరేందర్, 10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ లు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 వార్డు వివేకానంద కాలనీ ప్రజలు కరెంట్ సరఫరా సరిగా లేకపోవడం, ఓవర్ లోడ్ తో జంపర్ కాలి పోవడంతో కరెంట్ పోవడం జరుగుతుండేది దీని వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించి 10 వార్డు వివేకానంద కాలనీ కొంత ఏరియాకి కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ప్రజలు కరెంట్ సమస్యతో ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నర్సంపేట పట్టణంలో ప్రజలు విద్యుత్ సమస్యలు రాకుండా తక్షణమే విద్యుత్ అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామనీ, ముఖ్యంగా 10 వార్డు లో కరెంట్ సమస్యలు రాకుండా చేస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణి, విద్యుత్ శాఖ ఎఈ, అశోక్, వార్డు సభ్యులు దార గణేష్, అరెపెల్లి బాబు, మహేందర్, మారపెల్లి అశోక్, పాశికంటి రమేష్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్ తదితరులు పాల్గొన్నారు.