మన ప్రగతి న్యూస్ జవహర్నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
బయటకు వెళ్లిన యువకుడు తిరిగి రాని ఘటనపై జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కారం అరుంధతి నగర్కు చెందిన పోల పొంగు ప్రశాంత్ (24) లేబర్ పనులు చేస్తుంటాడు. ఈ నెల 5వ తేదీన పని ముగించుకుని సాయంత్రం 6:30 గంటల సమయంలో బైక్పై బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో ప్రశాంత్ తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

