Breaking News

ఆటో డ్రైవర్‌ అదృశ్యం

మన ప్రగతి న్యూస్ / జవహర్‌నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ ‌:

ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి అదృశ్యమైన ఘటన బాలాజీ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీ నగర్‌కు చెందిన చవాన్ జగన్ (50) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ తన నలుగురు పిల్లలను పోషిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఇతని భార్య మరణించింది. కాగా, ఈ నెల 1వ తేదీన ఉదయం ఆటోతో బయటకు వెళ్లిన జగన్ రాత్రి అయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. జగన్ సెల్‌ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌ వస్తుండటంతో ఆందోళన చెందిన సోదరి గీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ అదుపుతప్పి డివైడర్‌కు ఢీ: యువకుడి మృతి