ఐదు రోజుల శిశువు మృతి – వైద్యులపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష ప్రసూతి కోసం ఆసుపత్రికి చేరగా, ఐదు రోజుల క్రితం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, జన్మించిన ఐదు రోజులకే పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.బాబుకు సరైన వైద్యం అందించకపోవడం, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని అనూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట బంధువులు నిరసనకు దిగారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పసికందు మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది.



