.అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు
.రామన్నపేట ఎస్సై డి.నాగరాజు
మన ప్రగతి న్యూస్/రామన్నపేట:
మండలంలోని శోభనాద్రిపురం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు నుండి అక్రమంగా,దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న రామన్నపేట ఎస్సై డి.నాగరాజు తమ సిబ్బందితో కలిసి శోభనాద్రిపురం గ్రామ శివారు దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ మూడు(3) ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ లు ఉన్నాయని గమనించి, వాటి అనుమతుల గురించి అడుగగా వారి దగ్గర ఎటువంటి ఇసుక రవాణా అనుమతులు లేకపోవడంతో వారిని విచారించగా వారు ఇదే గ్రామానికి చెందినా ముక్కముల శ్రీశైలం,ఎరుకట్ల స్వామి మరియు బోడిగే మధు అని నిర్ధారించుకొని. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

