మన ప్రగతి న్యూస్/రామన్నపేట:
కుంచపు బాలరాజు గత 8 సంవత్సరాల క్రితం బాపట్ల జిల్లా (ఏపి) నుండి రామన్నపేటకు వచ్చి మేస్త్రి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.అతనికి రెండు సంవత్సరాల క్రితం రజిని (20)తో వివాహం జరిగింది.వారికీ ప్రస్తుతం ఒక సంవత్సరం వయస్సు గల కూతురు ఉన్నది.బాలరాజు ప్రతి రోజు లాగానే శనివారం రోజు ఉదయం మేస్త్రి పనికి వెళ్లి సాయంత్రం 05.00 గంటలకు ఇంటికి వచ్చి చూడగా భార్య మరియు కూతురు కనిపించ లేదని చుట్టుపక్కల వెతికినా కాని ఆదివారం వరకు ఆచూకి తెలియరాలేదని,ఇట్టి విషయం ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ డి.నాగరాజు కు సమాచారం అందించగా వెంటనే ఎస్ ఐ స్పందించి సిబ్బందిని ఆదేశించడంతో బి.కమలాకర్,హెడ్ కానిస్టేబుల్, రైటర్ స్వామి నాయక్ తో పిర్యాది ఇంటికి స్వయంగా వెళ్లి బాధితులని పరామర్శించి,ఆయన నుండి ఫిర్యాదును స్వీకరించడం జరిగిందని తెలిపారు.బాధితుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, న్యాయం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో సంఘటన స్థలంలోనే ఆన్-సైట్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు ఎస్ఐ డి, నాగరాజు తెలిపారు.

