మన ప్రగతి న్యూస్/వర్ధన్నపేట:
వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన ఊర సమ్మక్క అనే మహిళ సోమవారం ఉదయం తడి టవల్ తీగలపై ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఆపాస్మరక స్థితిలో కిందపడి పోయింది. గమనించిన మృతు రాలు భర్త రాజకుమార్ వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు పరిశీలించి, మరణించిందని తెలి పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట ఎస్ఐ. సాయి బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

