మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
స్నేహితులందరూ కలిసి సరదాగా చెరు వు వద్ద ఉన్న పడవతో చెరువులోకి వెళ్ల డంతో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడగా.. ఓ యువకుడు నీటిలో మునిగి గల్లంతయిన ఘటన సోమవారం యాదా ద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం గోస్కొండ గ్రామ చెరువు వద్ద జరిగింది. గోస్కొండ గ్రామంలో చెరువు వద్ద ఆరుగురు స్నేహితులు మత్స్యకా రులకు చెందిన పడవ ఎక్కి సరదాగా చెరువు నీటిలోకి వెళ్లారు. సుమారు 300 మీటర్ల దూరం వెళ్లేసరికి పడవ ఒక్కసారి గా పల్టీ కొట్టడంతో ఆరుగురు స్నేహితు లు నీటిలో పడిపోవడంతో.. వీరిలో ఐదు గురికి ఈత రావడంతో బయటికి ఈదుకుంటూ వచ్చారు. ఈత రాని మరో యువకుడు పాండాల శివ (24) నీటిలో మునిగి గల్లంతయ్యాడని వారు తెలిపా రు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

