- ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు..
- కుటుంబ కలహాలే కారణం అంటున్న స్థానికులు..
మన ప్రగతి న్యూస్/ నడికూడ:
తాగిన మైకంలో అన్న, తమ్ముడిని కత్తితో పొడిచిన సంఘటన నడి కూడ మండలం నార్లాపూర్ గ్రామం లో శుక్రవారం రాత్రి కలకలం రేపిం ది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దైనం పెల్లి మాలగొని (ఎస్సీ) కు ఇద్దరు కుమారులు. దైనంపెల్లి రమేష్, శ్రీనివాస్ లు. కుటుంబ కలహాల నేపథ్యంలో దైనంపెల్లి శ్రీనివాస్ (30) శుక్రవారం రాత్రి జరిగిన గొడవలో అన్న దైనంపెల్లి రమేష్ తాగిన మైకంలో తమ్ముడు శ్రీని వాస్ పై కత్తితో దాడి చేయగా.. పొట్ట భాగంలో కత్తి గుచ్చుకోవ డంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించగా.. నడికూడ మండల ఈఎంటి సతీ ష్, ఫైలెట్ పున్నం లు ఘటన స్థలా నికి చేరుకుని, ప్రధమ చికిత్స అం దిస్తూ.. వరంగల్ ఎంజీఎం ఆసుప త్రికి తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


