మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి:
ప్రమాదవశాత్తు కెనాల్ లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలో జరిగిం ది. కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాకు చెంది న ప్రకాష్ రాథోడ్ (30 ) తన బావలు బస్వరాజు పవార్, రామచంద్రం లు కలిసి సాయంత్రం సమయంలో తమ వ్యవసాయం పని మీద బైక్పై హైదరా బాద్ నుండి జగదేవపూర్ మండలం, పీర్లపల్లి గ్రామంలోని కెనాల్ వద్దకు వచ్చా రు. అక్కడికి చేరుకున్న తరువాత ఎండ వేడిమి తట్టుకోలేక ప్రకాష్ రాథోడ్ కెనాల్ లో ఈత కొట్టేందుకు ఒక్కడే వెళ్లాడు. కొంత సమ యం గడిచిన తరువాత అతను బయటకు రాకపోవడంతో అను మానం వచ్చిన మిగతా ఇద్దరు కెనాల్ వద్దకు వెళ్లి పరిశీలించగా.. అతను కనిపించ లేదు. చుట్టుపక్కల వెతకగా కెనాల్ ఒడ్డున అతని చెప్పులు,బట్టలు గమనిం చారు. ఈ విషయమై అతని బావ బస్వ రాజు పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, కెనాల్లో గాలించగా.. శుక్రవారం ఉదయం పీర్లపల్లి కెనాల్ గేట్ల వద్ద ప్రకాష్ రాథోడ్ శవమయై కనిపించాడు. అనంత రం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించి, పోస్ట్మార్టం నిర్వహిం చారు.

