- రైతులు బహిరంగ సభకు పెద్ద ఎత్తున పాల్గొనాలి..
- ఏవో పోరిక జైసింగ్.
మన ప్రగతి న్యూస్/నడికూడ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తుర్ పల్లి గ్రామంలో సోమ వారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీ ఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు నడికూడ మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భారీ బహి రంగ సభకు మండల కేంద్రంలోని కంఠాత్మకూర్, రాయపర్తి, చర్లపల్లి, నడికూడ క్లస్టర్ ల ఆధ్వర్యంలో రైతుల కోసం నాలుగు ప్రత్యేక బస్సుల ను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ బస్సులు క్లస్టర్ల నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరునని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో హాజరుకావా లని ఏవో పోరిక జైసింగ్ కోరారు. అలాగే సీఎం బహిరంగ సభను నడికూడ, కంఠాత్మకూర్, రాయపర్తి రైతువేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా రైతులు వీక్షించవచ్చునని తెలిపారు.

