- మేడిపల్లిలో కలకలం.. కానిస్టేబుళ్లకు గాయాలు
మన ప్రగతి న్యూస్ /మేడిపల్లి, మేడ్చల్ జిల్లా స్టాపర్
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ ఉన్మాది దాడికి తెగబడిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం కలకలం రేపింది. కిడ్నాప్ సమాచారంతో వెళ్లిన కానిస్టేబుళ్లపై నిందితుడు పూల బుట్టలతో దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మనీషా అనే యువతిని అభిజిత్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశా డంటూ బాధితురాలి సోదరి డయల్ 100కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న వెంటనే కానిస్టేబుళ్లు శృతి, రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడు వారిని లోపలికి రానివ్వకుండా గేట్లు వేసి సుమారు మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టాడు. నిందితుడిని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ రవి గోడ దూకడానికి ప్రయత్నించగా, నిందితుడు పైనుంచి పూల బుట్టలను పోలీసులపైకి విసిరాడు.ఈ దాడిలో శృతి, రవికుమార్లకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు మరియు దాడి చేసినందుకు గాను కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

