Breaking News

ఖమ్మంలో మాజీ ఎంపీ నామ పర్యటన – వధూవరులకు ఆశీస్సులు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి

ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఆయన, వివాహ వేడుకల్లో నూతన వధూవరులను ఆశీర్వదించారు.చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన వనజ వివాహం బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గోపీనాథ్‌తో ఖమ్మంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన నామ, వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రోటరీ నగర్‌లో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని, ఇటీవల వివాహం జరిగిన దంపతులను దీవించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

జ్యువెలరీ షాపులో భారీ దోపిడి..