మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

ఖమ్మం జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్గా మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు ఈ నియామకం కీలకంగా భావిస్తున్నారు. పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన దుర్గాప్రసాద్కు ఈ పదవి లభించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందాన్ని కలిగించింది.
