- ఐదుగురికి తీవ్ర గాయాలు..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. ఒకరు మృతి చెందిన సంఘటన నడి కూడ మండలం నర్సక్కపల్లి సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. అందులో ఒకరు స్పాట్ లోనే మృతి చెందగా.. మిగతా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలిసింది. కార్ నెంబర్ ఏపీ 28 డిబి 7745 గా గుర్తించారు. ప్రమాదానికి గురైన వారు దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. వీరు హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా..ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. పరకాల పోలీసులను చరవాణిలో వివరాలు కోరగా..ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


