- దేవాలయ కొలనులో పడి హనుమాన్ భక్తుడు మృతి..
మన ప్రగతి న్యూస్/గంభీరావు పేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. బుధవారం రాత్రి గ్రామంలోని స్థానిక దేవాలయం ముందున్న కొల నులో స్నానానికి వెళ్లిన హనుమాన్ మాలాధారణ భక్తుడు పడి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన నీరడీ వినయ్ (16) సిద్దిపేటలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హను మాన్ దీక్ష తీసుకున్న వినయ్, మరో ఎనిమిది మంది స్వాములతో కలిసి మల్లా రెడ్డిపేట లోని హనుమాన్ ఆలయ దర్శనానికి వచ్చాడు. ఆలయ ప్రాంగణం లోని కొలనులో స్నానం చేసేందుకు దిగిన వినయ్.. ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి మాలాధారణ స్వాములు కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటి కీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వినయ్ నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు. మృత దేహాన్ని వెలికి తీసి, శవ పరీక్ష నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

