
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
ఏన్కూరు మండలం ఇందిరానగర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ప్రధాన రహదారిపై వాహనాలను ఆపి తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు సూచించారు.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అలాగే వేసవికాలంలో రోడ్లపై పశువులు అకస్మాత్తుగా రావడం జరుగుతుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండి నెమ్మదిగా వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది శంకర్, నరేష్ పాల్గొన్నారు.
