Breaking News

అంగరంగ వైభవంగా ప్రారంభమైన రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రతిష్టాపం ఉత్సవాలు

విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు :

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన సర్పంచ్ తోట లక్ష్మి

రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం అయింది. శుక్రవారం రోజున ఆత్మకూరు మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆవరణలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ,,కంఠమహేశ్వర, సురమాంబ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ఉదయం విగ్రహాలను వాడవాడలా వేద పండితుల వేదమంత్రోత్సవాలతో పూజలు నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నీళ్లు ఆరగిస్తూ పసుపు,కుంకుమ,వేస్తూ కొబ్బరికాయలు కొడుతూ మనసారా వేడుకుంటున్నారు.ఈ ఉత్సవానికి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి,ఆత్మకూరు సర్పంచి పర్వతగిరి మహేశ్వరి రాజు,గౌడ సంఘం ఆలయ నిర్మాణ కమిటీ బృందం పొగాకుల కొమురయ్య, పొగాకుల రమేష్,గుర్రం ప్రభాకర్, వల్లాల రాజు, బూర మహేందర్, బైగాన్ని రమేష్ లు కొబ్బరికాయలు కొట్టి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 108 గుండాలలో 108 జంటల చేత గణపతి హోమం,, మృత్యుంజయ హోమం వేద పండితుల బృందం వేద మంత్రోత్సనులతో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సాయంత్రం మహాలక్ష్మికి కుంకుమ పసుపు అభిషేకాలను నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పూజలో పాల్గొన్నారు.