మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు:
ఆత్మకూరు మండలంలోని బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో పెరుమాండ్ల రాజు మాలతి దంపతులు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారం సర్పంచ్ తోట లక్ష్మీ కుమారస్వామి హాజరై వారికి బట్టలు బహుకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. ప్రతి కుటుంబం సొంతింటి కల నెరవేర్చుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

