Breaking News

వడదెబ్బతో యువకుడు మృతి..

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో యువకుడు వడ దెబ్బ కు గురై మృతి చెందాడు. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. మందలపల్లి గ్రామవాసి మోరంపూడి నాగేశ్వరరావు కుమారుడు మోరంపూడి సాయి విశ్వనాథ్ (27) శనివారం క్రికెట్ ఆడుతూ వడదెబ్బకు గురై వాంతులు కాగా ..మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించటంతో ..మెరుగైన ఆసు పత్రికి రెఫర్ చేయగా.. గాయత్రి ప్రైవేటు ఆసుపత్రి నందు వైద్యం చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారని వారు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

అత్తవారింటిపై అల్లుళ్లు కత్తితో దాడి..