Breaking News

అత్తవారింటిపై అల్లుళ్లు కత్తితో దాడి..

  • తీవ్రంగా గాయపడిన అత్తమామలు..
  • ఆసుపత్రికి తరలింపు..

మన ప్రగతి న్యూస్/గజ్వేల్ డివిజన్ ప్రతినిధి:

అదనపు కట్నం, కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఇద్దరు అల్లుళ్ళు కలిసి అత్త, మామ,భార్య పై కత్తితో దాడి చేసి హత్య యత్నం చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా దిలాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుం ది. గ్రామానికి చెందిన రాచకొండ నర్సిం లు, నాగమణి తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుర్లు.. ముగ్గురికి వివాహం చేశారు. పెద్ద కూతురు లలిత ను వడ్డేపల్లి గ్రామా నికి చెందిన శ్యామ్ కుమార్ తో చిన్న కూతురు అనితను వేములగట్ గ్రామా నికి చెందిన అరుణ్ తో వివాహం జరిపా రు. శ్యాం కుమార్ భార్య లలితను కొద్ది కాలం నుండి అదనపు కట్నం కోసం వేధి స్తూ అత్తమామలను కూడా వేధించేవా డని భార్య లలిత ఆరోపిస్తున్నారు. అరు ణ్ కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం అత్తమామలను గత కొద్ది కాలంగా వేధిస్తూ ఉండే వాడని నర్సింలు, నాగమణి ఆరోపిస్తున్నా రు. ఇద్దరు అల్లుళ్ళు శ్యాం కుమార్ అరుణ్ పథకం ప్రకారం అత్త మామ అత్త మామ భార్యపై కత్తితో దాడి చేసి హత్య యత్నం చేశారు. నర్సింలు, నాగమణి లలిత లకు తీవ్ర గాయాలు కాగా.. గ్రామ స్తులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. శ్యాం కుమా ర్, అరుణ్ ఇద్దరు నిందితు లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

వడదెబ్బతో యువకుడు మృతి..