Breaking News

మద్యం మత్తులో ఈతకు వెళ్లి.. ఇంటర్ విద్యార్థి జలసమాధి

మన ప్రగతి న్యూస్ / కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మద్యం మత్తులో చెరువులోకి ఈతకు వెళ్లి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి మల్లికార్జున నగర్‌కు చెందిన మదాని గౌరవ్ దత్తా (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం తన స్నేహితులు దారా కార్తికేయ, దేవరాజ్ హన్స్రాజ్‌లతో కలిసి యాద్గారిపల్లి సమీపంలోని ‘అండర్ ది మూన్’ రెస్టారెంట్ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే లోతు అంచనా వేయలేక గౌరవ్ దత్తా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గౌరవ్ నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి తల్లి మదాని రేఖ ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. నాచారంలో అభిమానుల సంబరాలు