Breaking News

నల్లబెల్లి మండలంలో మన ప్రగతి కథనానికి స్పందించిన అధికారులు

ఆధార్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మార్వో

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మన ప్రగతి కథనానికి స్పందించి
మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ను స్థానిక ఎమ్మార్వో ముప్పు కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆధార్ సెంటర్ ను మండల ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


ఈ కార్యక్రమంలో ఆధార్ సెంటర్ ఆపరేటర్ అడ్డగట్ల రాజు, ఆర్ ఐ, మరియు ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది , దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, పరికి రత్నం, తదితరులు పాల్గొన్నారు. మన ప్రగతి కథనానికి స్పందించి ఆధార్ సెంటర్ ను ప్రారంభించడానికి కృషిచేసిన మన ప్రగతి పత్రికకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు.