Breaking News

మైనర్‌పై లైంగిక వేధింపులో నిందితుడికి 10 ఏళ్ల జైలు

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం :మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన (పోక్సో) కేసులో నిందుతుడీకి పది సంవత్సరాలు జైలు,5000/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కేసు వివరాలు.. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ అమ్మాయిను ఎ2 ఎదురుగట్ల అజయ్ సన్/ఆఫ్ ఎల్లయ్య, 27వయసు,అంబేద్కర్ నగర్,వేములవాడ అతను ఎ1 అయిన గౌరవేణి నాగరాజు(జువేనైల్) కలిసి కిడ్నప్ చేసి బలవంతపు వేధింపులకు పాల్పడగా విక్టీమ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అప్పటి వేములవాడ డిఎస్పీ వెంకటరమణ దర్యాప్తు అనంతరం నిందితుడి రిమాండ్ చేసిన అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు తీర్పు… కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్, సీఎంస్ కనిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 18 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు. శాస్త్రీయ ఆధారాలు మరియు సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన ఎ2.ఎదురుగట్ల అజయ్ కు పది సంవత్సరాల జైలుతో పాటు 5000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఇట్టి కేసులో ఎ1 అయినటువంటి గౌరవేణి నాగరాజు(జువేనైల్) కావడంతో అతనిపై కేసు జువినల్ కోర్టులో నడుస్తున్నది. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ… సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణజరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు ఈకేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారి డిఎస్పీ వెంకటరమణ, ప్రస్తుత సి.ఐ వీరప్రసాద్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు,కోర్టు కానిస్టేబుల్ మహేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్స్ నవీన్, వెన్నెల లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

నీలోజిపల్లిలో కత్తిపోట్ల కలకలం..