- సురేష్, తిరుపతి
మన ప్రగతీ న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ సహకారంతో మహబూబాబాద్ జిల్లా కోర్టు లో ప్రధమ చికిత్స కేంద్రాన్ని న్యాయమూర్తులు సురేష్, తిరుపతి లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ కోర్టుకు వచ్చిన కక్షిదారులలో మహిళలు, వృద్ధులు, పిల్లలు అత్యవసర పరిస్థితులలో ఏదైనా వైద్య సహాయం కావలసి వస్తే వినియోగించుకునేందుకు అనుగుణంగా ప్రధమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.